టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.ఈ కుర్ర హీరో సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో డబ్బింగ్ అయ్యి యుట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటాయి.
అక్కడ కొంత వరకు బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి ఇమేజ్ ఉంది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో కూడా జెండా పాతాలని ఈ కొర్ర హీరో అనుకుంటున్నారు.
కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టడానికి బెల్లంకొండ సురేష్ వెనకుండి అన్ని నడిపిస్తున్నాడు.ఈ నేపధ్యంలో వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాని హిందీలో అదే టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీ మూవీగా రీమేక్ చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసం ముందుకొచ్చాడు.ఇదిలా ఈ సినిమాలో మొత్తం బాలీవుడ్ క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.
ఇక హీరోయిన్ గా కూడా అక్కడ ప్రస్తుతం మంచి ఇమేజ్ ఉన్న వారిని తీసుకోవాలని అనుకుంటున్నారు.
కియారా అద్వానీ, కృతి సనన్, దిశా పటాని, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ లని బెల్లంకొండ కోసం పరిశీలించారు.
అలాగే కొత్త హీరోయిన్లు అయినా సారా అలీఖాన్, సాయీ మంజ్రేకర్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.ఇప్పుడు లేటెస్ట్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ అమ్మడు అయితే కచ్చితంగా బోనీ కపూర్ నుంచి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు.అలాగే ఇప్పటి వరకు తీసుకునేదానికంటే రెట్టింపు రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెని హీరోయిన్ గా ఫిక్స్ చేయడానికి చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
.