కృష్ణవంశీ దర్శకత్వంలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి జాన్వీ కపూర్.తల్లి వారసత్వంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో కాకుండా మొదటి నుంచి డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.

 Jhanvi Kapoor Ready To Entry In Tollywood, Telugu Cinema, Bollywood, Sridevi, Kr-TeluguStop.com

తనని కేవలం కమర్షియల్ హీరోయిన్ గా ప్రాజెక్ట్ చేసుకోకుండా నటిగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఓ నాలుగు సినిమాల వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది.

తాజాగా రాజ్ కుమార్ రావ్ తో జాన్వీ చేసిన హర్రర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే చాలా రోజులుగా జాన్వీ కపూర్ ని టాలీవుడ్ లోకి తీసుకురావాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా కూతురుని సౌత్ కి పంపించేందుకి ఆసక్తిగానే ఉన్నారు.అయితే జాన్వీ కపూర్ సౌత్ లో కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ద్వారా లాంచ్ అవ్వాలని అనుకోవడం లేదు.

అయితే ఇప్పుడు ఈ భామ ఆలోచనలకి సరిపోయే కథ దొరికిందని టాక్ వినిపిస్తుంది.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ జాన్వీ కపూర్ కి ఒక ఫిమేల్ సెంట్రిక్ స్టొరీ లైన్ ఒకటి నేరేట్ చేసాడని, ఆ కథ తనకి నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బోగట్టా.

ప్రస్తుతం రంగ మార్తాండ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న కృష్ణవంశీ దీని తర్వాత జాన్వీ కపూర్ సినిమా కథని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube