అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ జాన్వీ కపూర్.శ్రీదేవి బ్రతికున్నంత కాలం తల్లిచాటు పిల్లలుగా అమ్మవెంటే ఎప్పుడూ తిరుగుతూ కనిపించే జాన్వీ కపూర్ ఇప్పుడు ఇండివిడ్యువల్ విమెన్ గా తనని తాను అమ్మకి తగ్గ కూతురుగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న జాన్వీ కపూర్ రొటీన్ గ్లామర్ పాత్రలు కాకుండా స్ట్రాంగ్ విమెన్ పాత్రలని చేస్తూ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.ఆమె ఎంపిక ఎలా ఉంటుంది అనేది గుంజన్ సక్సేనా సినిమా ఓ మచ్చుతునక అని చెప్పాలి.
ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాల వరకు ఉండగా అందులో రెండు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
ఇక అక్క బాటలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే మదర్స్ డే సందర్భంగా జాన్వీ కపూర్ అమ్మ శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.అందులో అమ్మ కలని తాను నిజం చేయలేకపోయానని చెప్పుకొచ్చింది.
తనని డాక్టర్ గా చూడాలని అమ్మ కలలు కంది.అయితే నా చదువు డాక్టర్ చేయడానికి సరిపడా స్థాయిలో లేదని నాకు తెలుసు.
అలాగే సినిమా వాతావరణంలో పెరగడం వలన చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది.ఈ కారణంగా డాక్టర్ అవ్వాలనే అమ్మ కలని నిజం చేయలేకపోయాను అంటూ భావోద్వేగానికి గురైంది.
నటిగా మాత్రం తల్లిని గుర్తు చేసే స్థాయిలో నిరూపించుకుంటా అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.