నెల్లూరు జిల్లా ఆత్మకూరు మెయిన్ బజార్లో శుక్రవారం రూ.50 లక్షల విలువైన బంగారం లిప్తలో చోరీకి గురైంది.సదరు బాదితుడు లబోదిబో మంటూ పోలీసుల వద్దకు పరుగులు తీసాడు .పోలీసుల వెంటనే స్పందించి వెతుకులాటలో వేగం పెంచారు .పట్టణానికి చెందిన ఉమా గోల్డ్వ్యాపారి ఉమామహేశ్వరరావు రోజూ రాత్రి సమయంలో దుకాణం మూసేసేటప్పుడు విలువైన వస్తువులు, బంగారాన్నిబాగులోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి ఉదయం తెచ్చేవారు.శుక్రవారం ఉదయం కూడా దుకాణం తెరిచిన తర్వాత బంగారం ఉన్న బ్యాగును షాపులో పెట్డాడు.
మంచినీటి కోసం పక్కనున్న దుకాణానికి వెళ్లి వచ్చే సరికి బ్యాగు కన్పించలేదు.అందులో సుమారుగా 2 కిలోల మేర నగలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.50 లక్షలు పైమాటేనని బాధితుడు తెలిపాడు.అతని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.