దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో బాల నటిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సహాయ నటీమణిగా ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించిన ముద్దుగుమ్మ సానుష.ఈవిడను గుర్తుపట్టాలి అంటే నాచురల్ స్టార్ నాని సినిమా జెర్సీ సినిమాలో రిపోర్టర్ పాత్ర పోషించిన ఆవిడ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఇకపోతే… తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి ఆమెను చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా జరుపుకున్న మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఆవిడ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తాను ఒకానొక సమయంలో వ్యక్తిగతంగా, అలాగే వృత్తి పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.అంతేకాకుండా అనేక మానసిక ఒత్తులకు గురయ్యానని కూడా తెలిపింది.
దాంతో తాను జీవితంలో తిరిగి వెలుగులు ఎలా నింపుకోవాలని తెలియక అనేక అగచాట్లు పడినట్లు చెప్పుకొచ్చింది.
దీంతోపాటు చివరికి ఏమి చేయాలనే ఆలోచన రాకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని, అందుకు చాలా భయపడ్డానని అనంతరం ఓ మానసిక వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకున్నట్లు తెలియజేసింది.
అలా చికిత్స తీసుకున్న తరువాత కొన్ని రోజులకు తన ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకొచ్చింది ఈ భామ.అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా దాంతో కొందరు నెటిజెన్స్ ఆమె పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ ను గమనించిన ఆవిడ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ నా మానసిక ఆరోగ్యం గురించి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు పలువురు నెటిజన్స్ తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని మానసిక కుంగుబాటుతో ఇబ్బంది పడేవాళ్లు నా వీడియో చూసి కొంతవరకైనా ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతో నేను చాలా ధైర్యంగా మాట్లాడనని చెప్పుకొచ్చింది.ఇకపోతే సానుష ఇదివరకు బంగారం చిత్రంలో హీరోయిన్ చెల్లెలిగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ సినిమాలలో కీలక పాత్రలను పోషించిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత సుపరిచితం అయింది.