పాకిస్తాన్ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ సోదరుడు అరెస్ట్!

పుల్వామా దాడి సూత్రదారి జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు హమద్ అజార్ ని పాకిస్తాన్ లో అరెస్ట్ చేసారు.దీనికి సంబంధించిన అధికారం సమాచారం బయటకి వచ్చిన నిషేధిత ఉగ్రవాద సంస్థలకి చెందిన ప్రతినిధులని పాకిస్తాన్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Jem Masood Azhar Brother Arrested In Pak-TeluguStop.com

ఇక హమద్ తో పాటు జైషే మహ్మద్ సంస్థకి చెందిన ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ ని కూడా పాకిస్తాన్ లో కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

జైషే మహ్మద్ సంస్థ మీద, ఆ సంస్థకి చెందిన ప్రతినిధుల మీద యాక్షన్ తీసుకోవాలని అగ్రదేశాలు నుంచి పాకిస్తాన్ కి వార్నింగ్ వస్తున్న నేపధ్యంలో అంతర్జాతీయంగా తమని ఎవరు తప్పు పట్టకుండా వుండాలని పాకిస్తాన్ ఉన్నపళంగా మసూద్ సోదరుడుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ మాత్రం కిడ్నీ సంబంధింత సమస్యలతో పాకిస్తాన్ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలుస్తుంది.ఇక ఉగ్రవాద ముద్ర నుంచి బయట పడటానికి పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతని మొదలెట్టినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube