అమెజాన్ అంటే తెలియని వారు ఉండరు.ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్స్ లో టాప్ రేటింగ్స్ ప్రోడక్ట్స్ తో ప్రజలు మెచ్చిన సంస్థ కాబట్టి.
ఏ వస్తువు కావాలన్నా గాని కాలు బయట పెట్టకుండా ఒకే ఒక క్లిక్ తో మన ఇంటి ముందుకు వచ్చి డెలివరీ ఇచ్చి మరి వెళ్తారు.అందుకే అమెజాన్ బాగా పాపులర్ అయింది.
అయితే ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఒక కీలక ప్రకటన చేశారు.అదేంటంటే కరేజ్ అండ్ సివిలిటీ పేరుతో ఒక అవార్డును ప్రకటించి, ఆ అవార్డును ఇద్దరికి ప్రధానం చేయాలనీ అనుకుంటున్నారట జెఫ్ బెజోస్.
ఈ అవార్డు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి.మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరా అని అనుకుంటున్నారా.?
ప్రముఖ చెఫ్ జోష్ ఆండ్రెస్ కు కరేజ్ అండ్ సివిలిటీ అవార్డు ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు.అలాగే చెఫ్ జోష్ ఆండ్రెస్ తో పాటు సామాజిక కార్యకర్త అయిన వ్యాన్ జోన్స్ కు కూడా ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.అయితే ఈ అవార్డు కింద వారి ఇరువురికి చెరో వంద మిలియన్ డాలర్లు బహుమానం కింద ఇవ్వనున్నారు జెఫ్ బెజోస్.ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి వలన ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అలాగే చాలా మంది ఆకలి బాధతో అల్లాడిపోయారు.
అలాంటి విపత్కర సమయంలో మన భారతదేశంలోని కొన్ని లక్షల మందికి చెఫ్ జోష్ ఆండ్రెస్ ఆహారం అందించారు.
ఆయన చేసిన ఈ మంచి పనిని గుర్తించి అమజాన్ అధినేత ఈ అవార్డు కోసం ఆయనని ఎంపిక చేయడం జరిగింది.అలాగే మరొక వ్యక్తి వ్యాన్ జోన్స్ కూడా ఒక సామజిక కార్యకర్త.
ఆయన కూడా ఎంతో సేవ చేసారు.అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం సామాజిక కార్యకర్త అయిన వ్యాన్ జోన్స్ ఎంతోగానో కృషి చేశారు.
ఆయన సమాజానికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ అధినేత వ్యాన్ జోన్స్ కి కూడా అవార్డు ఇవ్వనున్నారు.