జీవిత, రాజశేఖర్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.నగరి కోర్టు తాజాగా జీవితపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అదే సమయంలో జోష్టర్ ఫిల్మ్ సర్వీసెస్ యాజమాన్యం జీవిత, రాజశేఖర్ లపై సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణల గురించి జీవిత వివరణ ఇచ్చారు.తమకు సమన్లు రావడం వాస్తవమేనని అయితే తమను అరెస్ట్ చేయలేదని ఆమె కామెంట్లు చేశారు.
నగరిలో ఈ కోర్టు కేసు నడుస్తోందని ఆమె తెలిపారు.
ఏడాది క్రితమే ఈ కోర్టు కేసు మొదలైందని అయితే వాళ్లు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు ఎందుకు చేశారో తమకు అర్థం కావడం లేదని ఆమె వెల్లడించారు.
గతంలో కూడా తనపై వారెంట్ ఇష్యూ కాగా ఆ సమయంలో తాను గెలిచానని జీవిత పేర్కొన్నారు.కోటేశ్వర రావు 26 కోట్ల రూపాయలు మోసం చేసినట్టు చెబుతున్నారని అయితే అవి ఏ కోట్లు అనే విషయం తనకు అర్థం కావడం లేదని ఆమె వెల్లడించారు.
వాళ్లు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని తాము ఎవరినీ మోసం చేయలేదని జీవిత పేర్కొన్నారు.
తాను, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని ఆమె కామెంట్లు చేశారు.తమ మేనేజర్లు కోటేశ్వర రావు వల్ల ఇబ్బంది పడ్డారని జీవిత తెలిపారు.నేను తప్పు చేస్తే ఒప్పుకుంటానని తప్పు చేయకపోతే మాత్రం దేవుడిని కూడా ధైర్యంగా నిలదీస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
తమపై ఆరోపణలు చేసిన వాళ్లు మహాత్ములు కాదని ఆమె పేర్కొన్నారు.
ఇష్టానుసారం థంబ్ నైల్స్ పెట్టి వీడియోలు క్రియేట్ చేయవద్దని ఆమె పేర్కొన్నారు.వైరల్ అయిన వీడియోలను చూసి తాను ఇబ్బంది పడ్డానని ఆమె అన్నారు.తన కూతుళ్ల గురించి, నిహారిక గురించి సోషల్ మీడియాలో ఇదే తరహా పోస్టులు పెట్టారని జీవిత కామెంట్లు చేశారు.
ఇబ్బంది పెట్టే విధంగా థంబ్ నైల్స్ పెట్టవద్దని ఆమె కోరారు.