ప్రస్తుతం ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి బాగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో పోటీ చేయడానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవలే ప్రకాష్ రాజ్ తన టీమ్ లో మద్దతు పలకడానికి హేమ, జీవిత రాజశేఖర్ లు చేరారని తెలుపగా.అంతకుముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న బండ్ల గణేష్ ఇటీవలే అందులో నుండి బయటికి వచ్చారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రాజశేఖర్ ప్యానెల్ లో జీవిత రాజశేఖర్ చేరిందని అందుకే తాను అందులో నుంచి బయటికి వచ్చాను అంటూ ఇటీవలే తెలిపాడు.
ఇక జీవిత రాజశేఖర్.తన అభిమాన స్టార్ హీరోలైన చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను గతంలో విమర్శించిందని అందుకే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి బయటికి వచ్చానని తెలిపాడు బండ్ల.
దీంతో తాజాగా జీవిత రాజశేఖర్ ఈ విషయం గురించి స్పందిస్తూ ఓ టీవీ ఛానల్ లో మాట్లాడింది.తను ఈసారి కూడా జనరల్ సెక్రెటరీగా పోటీ చేయడానికి వచ్చానని ఇండస్ట్రీకి తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపింది.
తనతో విష్ణు, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ లు మాట్లాడారని.తనకు సహాయం చేయాలనే విషయాలలో అవగాహన ఉండటంతో ప్రకాష్ రాజ్ తో చర్చించానని అందుకే ఆయన ప్యానెల్ లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.ఇక బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు స్పందించగా.మెగా ఫ్యామిలీ కి తమకు మధ్య వివాదం జరిగింది చాలా ఏళ్ళు అయిందని.
ఆ విషయాన్ని పట్టుకొని మా మధ్య గొడవ ఉందంటూ తెగ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది.
డైరీ విడుదల సమయంలో అక్కడ జరిగిన వివాదం లో చిరంజీవి కి సంబంధం లేదని తెలిపింది.అక్కడ నరేష్ కు, ఇతర ప్యానెల్ సభ్యులకు మధ్య కొన్ని చర్చలు జరిగాయని దాన్ని వివాదంగా సృష్టించారని తెలిపింది.ఇక బండ్ల గణేష్ మాట్లాడిన దానికి కూడా అర్థం లేదని.
ఈ ఎన్నికల విషయంలో బండ్ల గణేష్ చేస్తున్న ఆరోపణలు సరైనది కాదు అంటూ.తమకు మెగా ఫ్యామిలీకి మధ్య గతంలో విబేధాలు ఉండేవి.
కానీ అవన్నీ ఎప్పుడో ముగిసాయి అని తెలిపింది జీవిత రాజశేఖర్.కానీ ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మళ్లీ వివదాలు సృష్టిస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని తెలిపింది.