కరోనాపై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలకు ఇంకా సినీ కార్మికులకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన వారు విరాళాలు ఇస్తున్న విషయం తెల్సిందే.టాలీవుడ్ నుండి భారీ ఎత్తున విరాళాలను ప్రముఖులు ప్రకటించారు.
ఇక ఈ సమయంలోనే రాజశేఖర్ ఫ్యామిలీ కూడా విరాళాలను ప్రకటించింది.అయితే సినీ వర్గాల్లో ఇంకా మీడియా వర్గాల్లో కూడా ఈ విషయమై రచ్చ జరుగుతోంది.
రాజశేఖర్, జీవితల కుటుంబ సభ్యులు మరీ పబ్లిసిటీ కోసం ఇలా చేయడం ఏంటీ అంటున్నారు.జీవిత రాజశేఖర్లు కలిసి కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం కిరాణ సరుకులు ఇంకా ఆహార పదార్థాలను అందించడం జరిగింది.
ఇక వారి కూతుర్లు శివాని ఇంకా శివాత్మికలు తాము కూడా చెరో లక్ష రూపాయలను విరాళాలను ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా గొప్పగా ప్రకటించుకున్నారు.మొత్తానికి ఈ ఫ్యామిలీ ఇచ్చిన విరాళంను గొప్పగా చెప్పుకుంటూ ఇచ్చిన కొద్ది మొత్తంనే ముగ్గురు విడి విడిగా ఇచ్చి మేము ముగ్గురం ఇచ్చామని ప్రకటించుకున్నారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.మీరు చేసిన సాయం నిజంగా అభినందనీయం.కాని ఇంత కొద్దిగా చేసి మీకు మీరు అంతగా చెప్పుకోవడం ముగ్గురం చేసినట్లుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మీరు చేసిన సాయంకు ఇంత పబ్లిసిటీ అక్కర్లేదు అనుకుంటున్నాం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయినా రాజశేఖర్ స్థాయికి కనీసం పాతిక లక్షలు అయినా ఇవ్వాలి కాని ముగ్గురు మూడు లక్షలు ఇచ్చి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని విమర్శలు వస్తున్నాయి.