మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి డాక్టర్ రాజశేఖర్ పై అసహనం వ్యక్తంచేసింది విషయం తెలిసిందే.అయితే ఇందుకుగాను డాక్టర్ రాజశేఖర్ అప్పటికప్పుడు స్టేజి మీద నుంచి దిగిపోయి తనదైన శైలిలో నిరసన తెలిపారు.
అయితే ఆ తర్వాత తాను ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో డాక్టర్ రాజశేఖర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు.ఇందులో ఈరోజు జరిగిందంతా కేవలం నాకు మా ప్రెసిడెంట్ నరేష్ మరియు “మా” కి మధ్యనే నని అన్నారు.
ఇక్కడ చెప్పిందంతా సరైంది కాదని అందుకే కామ్ గా ఉండలేకపోయానని అన్నారు.అంతేగాక ప్రత్యేకంగా నాకూ చిరంజీవి గారికి మరియు మోహన్ బాబుక్లి మధ్య ఎటువంటి గొడవలు, వివాదాలు లేవని అన్నారు.
తన తీరుతో అక్కడ ఉన్నటువంటి సినీ పెద్దలకు ఎవరికైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమని క్షమాపణలు కోరారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే జీవిత రాజశేఖర్ తన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం గురించి కూడా స్పందిస్తూ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ తన వంతు సహకారం ఎప్పుడు మా అసోసియేషన్ కి అందిస్తానని అన్నారు.అంతేగాక ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేసి తమ మధ్యలో గొడవలు పెట్టొద్దని కోరారు.
అయితే ఇది ఇలా ఉండగా ఈ విషయంపై పలు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అప్పుడు స్టేజీపై అంత నానా రభస చేసి ఇప్పుడు క్షమాపణ కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.అయితే ఇది ఇలా ఉండగా మామూలుగానే గతంలో కూడా చిరంజీవికి రాజశేఖర్ కి వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని అందువల్లనే గత కొంతకాలంగా వీళ్ళు కనీసం మాట్లాడుకోవడం కూడా లేదని గుసగుసలు వినిపించాయి.