“మా” అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 10 వ తారీఖున జరగనున్న సంగతి తెలిసిందే.అసోసియేషన్ లో తొమ్మిది వందల మంది సభ్యులకు సంబంధించిన ఈ ఎన్నికలు పై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియా ఫోకస్ ఎక్కువైపోయింది.
దీంతో అసలైన పాలిటిక్స్ లైట్ చేసుకుని.సినీ పాలిటిక్స్ కి మీడియా కవరింగ్ ఉన్న కొద్దీ పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సామాన్య ప్రజలు ఈసారి “మా” అధ్యక్ష పదవిని ఎవరు అధిరోహిస్తారు అనేదాని గురించి ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ క్రమంలో పోటీదారుల లో ఒకరైన విష్ణు ఇటీవల మీడియా సమావేశంలో… ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన జీవిత రాజశేఖర్ భర్త రాజశేఖర్ తన తండ్రి మోహన్ బాబు తో మాట్లాడినట్లు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో జీవిత రాజశేఖర్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో ఆమె తాజాగా తన భర్త రాజశేఖర్ మోహన్ బాబు తో..మాట్లాడిన విషయాలు గురించి బయట పెట్టింది.సినిమా ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు పై చర్చించడం జరిగిందని ఇదే సందర్భంలో చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బయట చెప్పుకుంటున్నారని… ఈ నేపథ్యంలో వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారని అన్నారు.
ఈ విషయాలు తప్ప ఇంకా మరో విషయాల గురించి చర్చించలేదని జీవిత రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.