కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీ ఎంపి అరవింద్ పై మండిపడ్డారు.నిజామాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటు అంశంపై ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులను టార్గెట్ చేశారు.
పసుపు పంటకు మద్ధతు ధర ఇవ్వలేదని జీవన్ రెడ్డి అన్నారు.పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో బాండ్ పేపర్ మీద రాసిచ్చిన అరవింద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి.
జగిత్యాలలో పసుపు పండితే వెళ్లి తమిళనాడులో బోర్డు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియా ముందు ఫోజులు కొడుతున్న అరవింద్ పసుపు రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు.
ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే అరవింద్ ప్రచారం సాగించాలని.ఆయన గెలిచాక మాత్రం ఆ అంశాన్ని తేల్చలేదని మండిపడ్డారు.పసుపు బోర్డు కేంద్రం తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.అందుకే జీవన్ రెడ్డి బీజేపీ ఎంపీ అరవింద్ మీద తీవ్ర విమర్శలు చేశారు.
ఎంపీ అరవింద్ కూడా ఈ అంశంపై స్పందిచారు.తమిళనాడు మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబందించినదని ఆయన అన్నారు.
నిజామాబాద్ లో పసుపు బోర్డు బదులు రీజనల్ స్పైసెస్ బోర్డ్ ద్వారా అక్కడ రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అరవింద్ చెప్పారు.