పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత కాంగ్రెస్ లో అతి మామూలుగా ఉండే వర్గ విభేదాలు పెద్దగా బయటికి రాలేదనే చెప్పవచ్చు.ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి పది రోజుల ముందుగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లను కలసి పార్టీ పటిష్టతకు వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.
దీంతో కాంగ్రెస్ లో అందరూ ఒక్కటయ్యారనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.అయితే పీసీసీ చీఫ్ పదవి ఆశించిన ఎమ్మెల్సీ జీవన రెడ్డి లాంటి వ్యక్తులు రేవంత్ కు పీసీసీ చీఫ్ ను ఇవ్వడాన్ని అధిష్టానం దగ్గర వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇక పరిస్థితులన్నీ ఇక రేవంత్ వైపు ఉండటంతో ఇక జీవన రెడ్డి ఒక్కడిగా పోరాడి చేసేది ఏమీ లేదన్న పరిస్థితి ఉండటంతో ఇక తానూ మెట్టు దిగి కలిసి రాక తప్పేలా లేదు.ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక కసరత్తు కమిటీలో జీవన రెడ్డి పేరు ఉండటంతో ఇక తిరిగి అందరితో పాటు కలసి కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే ఇక కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికను నామ మాత్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.స్వయంగా రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలవడం కష్టం అనే తరహాలో మాట్లాడటంతో అనధికారికంగా కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.