విశాఖను ఎగ్జికుటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంపై జనసేన కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ స్పందించారు.జగన్ ప్రకటించిన మూడు రాజధానులు, విశాఖను ఎగ్జికుటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంపైనా ఆయన్ను ప్రశ్నించగా విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు.
సచివాలయ సిబ్బంది కోసం అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయింపులు జరుగుతాయని, అంతకుమించి అక్కడేమీ జరగదంటూ ఆయన చెప్పుకొచ్చారు.ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని దీనిని ప్రజలంతా గుర్తుంచుకోవాలని జేడీ సూచించారు.
సచివాలయం ఏర్పాటు చేయడం వల్ల విశాఖ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు.ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ అని లక్ష్మి నారాయణ అన్నారు.
కేవలం ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయడంవల్లనే అభివృద్ధి చెందుతుందని అనుకుంటే ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందేవాళ్ళం కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఎక్కడా విశాఖను రాజధానిగా అంగీకరిస్తున్నారా ? వ్యతిరేకిస్తున్నారా అనే విషయం తేల్చకుండా పై విధంగా మాట్లాడారు.