ఏపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అంతగా అయన ప్రాచుర్యం పొందాడు.
ప్రజలకు సేవ చేయడానికి ఐపీఎస్ కేడర్ ఉద్యోగాన్ని వదిలి వచ్చానని కొన్నాళ్లుగా లక్ష్మినారాయణ చెబుతున్న సంగతే.ఇప్పటికే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశాడు.
అందుకు సంబంధించి నివేదికలు కూడా చంద్రబాబు నాయుడు కు ఇచ్చానని ప్రకటించాడు.తను రాజకీయాల్లోకి వస్తానని ఈయన ప్రకటించుకొంటూ వచ్చాడు.
అయితే తాజాగా ‘ జన ధ్వని’ అంటూ .కొత్త పార్టీ కూడా పెట్టేసి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారిపోయాడు.
అసలు లక్ష్మీ నారాయణ మనస్తత్వానికి పార్టీ నడపగలడా అనే అనేక అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే… పార్టీ నడపడం అంటే ఆషామాషీ కాదు కదా ! అదంతా భారీ ఖర్చుతో కూడుకున్నది.అది కూడా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలనుకుంటున్న ఈయన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తాడో చూడాలి.ఈ విధంగానే లోక్ సత్తా పార్టీ పెట్టి ఎన్నికల సమరంలోకి వెళ్లి చేతులు కాల్చుకున్న జయప్రకాశ్ నారాయణ ను ఇప్పడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
ఆ విషయాలన్నింటిని పక్కనపెడితే … లక్ష్మి నారాయణ కొత్తగా పెట్టిన పార్టీ ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ ఓట్లను చీల్చబోతుంది అనేది ఆసక్తి నెలకొంది.ముఖ్యంగా… వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉన్నట్టు మాత్రం పార్టీలు ఒక అంచనాకు వచ్చేసాయి.అసలు జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చుదామనే ప్లాన్ లో ఉన్న జనసేన పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది.ముఖ్యంగా ‘జనధ్వని’ బలపడే కొద్దీ జగన్ కు మేలు జరుగుతుంది.
అదే సమయంలో టీడీపీ- జనసేన పార్టీలకు నష్టం చేకూరే అవకాశం కనిపిస్తోంది.దీంతో కొత్తగా రాజకీయాల్లో వచ్చిన జనసేన ‘జనధ్వని’ కారణంగా … నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.