ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వాఖ్యలు!

అధికార తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడుగా వున్న కూడా జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిగా ఎవరి మీద అని విమర్శలు చేయడంలో సిద్ధ హస్తుడు.ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలతో హడావిడి చేసే జేసీ దివాకర్ రెడ్డి తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద సంచలన వాఖ్యలు చేసారు.

 Jc Diwakar Reddy Sensational Comments On Chandrababu-TeluguStop.com

ప్రస్తుతం టీడీపీ పార్టీలో 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలని కచ్చితంగా మార్చాల్సిందే అని జేసీ దివాకర్ రెడ్డి వాఖ్యలు చేసారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది మీద ప్రజలలలో వ్యతిరేకత వుందని జేసీ స్పష్టం చేసారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకపోతే అతని టీడీపీ ఓటమిని ఎవరు ఆపలేరని చెప్పుకొచ్చారు.ఏపీలో ప్రజలు చంద్రబాబుని చూసి ఓట్లు వేసేస్తారు అనుకుంటే కచ్చితంగా అది పొరపాటే అవుతుందని, ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితి లేదని జేసీ స్పష్టం చేసారు.

ఇలాంటి పరిస్థితిలో టీడీపీ సిట్టింగ్స్ లో 40 శాతం మందిని మార్చేసి కొత్తవారికి టికెట్ ఇస్తే మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని జేసీ తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube