తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు సలాం కొట్టిన వారు ఇప్పుడు మాపై చేయి ఎత్తేందుకు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మళ్లీ తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ ఒకానొక సమయంలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడాడు.
జేసీ వ్యాఖ్యలపై పోలీసు సంఘం తీవ్రంగా మండి పండింది.
పోలీసులు బూట్లు నాకే వారిలా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఈ సందర్బంగా పోలీస్ సంఘం నాయకులు అన్నారు.
పోలీసులు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఉపయోగించుకోవడం కాదని, తమ డ్యూటీని సక్రమంగా చేస్తామంటూ ఈ సందర్బంగా పోలీసులు అంటున్నారు.జేసీ తన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు.
ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు.