తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ ఓటమి పై సుదీర్ఘంగా చర్చింస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంధి అవస్థలో ఉంది.ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తర్వాత రెండో లీడర్ గా ఉన్న లోకేష్ నాయకత్వంపై పార్టీ నేతలు కార్యకర్తలు అంత సంతృప్తిగా లేరనే విషయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇక చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ కి అప్పగించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా టిడిపి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని అయితే పార్టీ కోసం కొన్నాళ్ళు కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని జెసి వాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ కష్టపడితే భవిష్యత్తులో మంచి నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పడం విశేషం.
ఇదే సమయంలో జనసేన అధినే నెగిటివ్ వ్యాఖ్యలు చేశారుత పవన్ కళ్యాణ్ మీద మాత్రం జేసీ దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి రాజకీయాలు కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ ని జనం కేవలం చూసేందుకు మాత్రమే వస్తారని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.