జేసీ బ్రదర్స్.ఈ పేరు రాజకీయాల్లో విని ఉండనివారు ఉండరు.అనంతపురం జిల్లాలో.ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ఆధిపత్యం చెలాయించేవారు.అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో వీరి ఆధిపత్యానికి గండి పడింది.దీంతో రాజకీయంగా వెనక్కు తగ్గినట్లేనని రాజకీయ పండితులు అంటున్నారు.
గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు జేసీ బ్రదర్స్లో కనిపించడం లేదు.ప్రస్తుతం వీరు చడీచప్పుడు లేకుండా ఉంటున్నారు.
ఇప్పటికైతే టీడీపీలో కొనసాగుతున్నా అందులోనూ సంతృప్తికరంగా లేరు.మరో గత్యంతరం లేకే ఆపార్టీలో కొనసాగుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
తాజాగా చంద్రబాబు జేసీ బ్రదర్స్పై ఆంక్షలు పెట్టారు.బలం ఉన్న ఇతర నియోజకవర్గాల్లో పర్యటించొద్దని జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు ఆదేశించారు.దీంతో అతని అనుచురులు ఆగ్రహంగా ఉన్నారంటా.గత ఎన్నికల నుంచి జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
వారి వారసులను రంగంలోకి దించారు.అయితే తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కమార్ రెడ్డి ఇద్దరు ఓడిపోవడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి పరువు దక్కించుకున్నారు.
తాజాగా పార్టీ అధినాయకత్వం జేసీ బ్రదర్స్కు మరో షరతు విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి తిరిగి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.వైసీపీ పెద్దారెడ్డిపై గెలుపొందాలంటే జేసీ అస్మిత్ రెడ్డి కన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితేనే బెటర్ అని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని సమాచారం.
ఇక, అనంతపురం పార్లమెంటు స్థానానికి మాత్రం జేసీ పవన్ కుమార్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించడంతో పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
మరీ, చంద్రబాబు పెట్టిన ఆంక్షలను జేసీ బ్రదర్స్ ఓకే చెబుతారా? లేదా అన్నది వేచి చూడాలి మరీ.