అసోంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు యుద్దరంగాన్ని తలపిస్తున్నాయి అంటున్నారు.ఒకరిపై ఒకరు దూషించుకుంటున్న తీరు చూస్తుంటే పదవి కోసం ఎంతకైన దిగజారుతారనేలా వీరి మాటల తూటాలు పేలుతున్నాయట.
ఇదిలా ఉండగా అసోం ఎన్నికల్లో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారంలో పాల్గొని మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం తెలియదని, కేవలం ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి మరోపేరు మోసం అంటూ ఆయన మండిపడ్డారు.మన్మోహన్ సింగ్ 10 ఏండ్లు ప్రధానిగా ఉన్నా అసోం కు కనీసం పది సార్లు కూడా రాలేదని, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 35 సార్లు వచ్చారని నడ్డా చెప్పారు.
కాగా ఈ రోజు గువహటిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు.