టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పుడు ఉన్న అంత పోటీ ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదు.
ఇంతకు ముందు ప్రెసిండేట్ పదవి కోసం ఏకగ్రీవముగా ఎన్నుకునే వారు.కానీ గత ఎన్నికల నుండి పోటీ మొదలయ్యింది.
గత ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
అయితే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పోటీ ఏర్పడింది.
ఇద్దరు పోటీ పడుతున్నారు అనుకునే సరికి మరొక ఇద్దరు తెరపైకి వచ్చారు.ఇంకా పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
అందుకే ఈసారి ఎలెక్షన్స్ మరింత హీట్ పెంచుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండబోతుందని ఇప్పటికి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీరితో పాటు జీవిత రాజశేఖర్, నటి హేమ కూడా బరిలోకి దూకడంతో పోటా పోటీగా ఈసారి ఎలక్షన్స్ జరగనున్నాయి.
ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు ఇవ్వగా మంచు విష్ణు కు ఘట్టమనేని కాంపౌండ్ కృష్ణం రాజు మద్దతు ప్రకటించారు.అంతేకాదు హేమ, జీవిత కూడా తమ వర్గాల్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.అందుకే ఇప్పుడు మా ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి.
అయితే ఇక్కడితో ఆగకుండా మరొకరు కూడా మా ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
సహజనటి జయసుధ కూడా మా అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈమె ఇంతకు ముందు కూడా ఈ పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.మళ్ళీ ఇంతకాలం తర్వాత ఈమె పేరు తెరపైకి వచ్చింది.
కానీ ఆమె ఈ పదవికి అంత ఆసక్తిగా లేరని తెలుస్తుంది.కానీ ఒక వర్గం వారు ఆమెను పోటీ చేయాలనీ ఒత్తిడి తెస్తున్నారని టాక్.
ఆమె పోటీ చేయకపోతే ఏ వర్గం వారు విష్ణుకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందట.
తాజా వార్తలు