వెండి తెరపై సహజ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ వంటి హీరోల సరసన నటించిన జయసుధ అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ఈమే యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
తాజాగా ఈమె తమిళ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో కూడా సందడి చేశారు.ఇక ఈ సినిమా తమిళంలో వరిసు పేరుతో విడుదలైంది.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరి ప్రశ్నిస్తూ మీరు ఎందుకు ఇప్పటివరకు హీరో అజిత్ కు తల్లిగా తన సినిమాలలో నటించలేదని ఈమెను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జయసుధ సమాధానం చెబుతూ.
తనకు ఇదివరకు అజిత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.అయితే ఆయన సినిమా షూటింగ్ ప్రారంభమై ఒకరోజు సినిమా షూటింగుకు కూడా వెళ్లాను.అనంతరం కరోనా రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.
కరోనా తగ్గిన తర్వాత సినిమా షూటింగ్ జరిగినప్పటికీ కేవలం కరోనా భయంతో తాను సినిమా షూటింగులో పాల్గొనలేదని అందుకే అజిత్ సినిమాలో నటించలేకపోయానని ఈ సందర్భంగా జయసుధ సమాధానం చెప్పారు.ఇక ఆ సినిమాలో నా బదులు నటి సుమిత్ర నటించారని ఈమె గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం జయసుధ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.