టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి జయప్రకాష్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.చిన్నస్థాయి నటుల నుంచి ప్రధాని మోదీ వరకు జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
కెరీర్ లో వరుస విజయాలతో, వరుస అవకాశాలతో జయప్రకాష్ రెడ్డి ఎప్పుడూ బిజీగానే ఉన్నారు.ఆయన కొడుకు సైతం అమెరికాలో స్థిరపడ్డారు.
అయితే తాజాగా జయప్రకాష్ రెడ్డి కుటుంబం ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంటోందా… ? అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన జయప్రకాష్ రెడ్డి రంగస్థల నటుడిగా వేషాలు వేసి సినిమాల్లో తన కోసమే ప్రత్యేక పాత్రలు సృష్టించే స్థాయికి ఎదిగారు.
లక్షల రూపాయలు పారితోషికం రూపంలో అందుకున్నారు.అయితే బాలకృష్ణ ఆర్థిక సాయం వల్ల జేపీ కుటుంబం ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంటోందా…? అనే చర్చ జరుగుతోంది.
బాలయ్య సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లో విలన్ పాత్రలో జేపీ నటించారు.ఈ సినిమాలతో పాటు మరికొన్ని బాలయ్య సినిమాల్లో కూడా జేపీ కీలక పాత్రలు పోషించారు.దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బాలకృష్ణ జేపీ మధ్య సాన్నిహితం ఉంది.జేపీ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన బాలకృష్ణ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించాడో లేదో అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడలేదు.సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు జేపీ విశ్రాంతి లేకుండా సినిమాలు చేశారు.
బాలయ్య సాయం గురించి వార్తలు రావడంతో జేపీ కుటుంబం కష్టాల్లో ఉందా…? అనే చర్చ జరుగుతోంది.ఆయన చనిపోయిన ఫ్లాట్ చిన్నగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది.