సినీ నటి … మాజీ ఎంపీ జయప్రద ఇప్పుడు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాను అమర్ సింగ్ కు రాఖీ కట్టినా….
జనం మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటూ… చీఫ్ గా వ్యవహరిస్తున్నారని జయప్రద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబైలో జరుగుతున్న క్వీన్స్లైన్ లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమర్ సింగ్తో తనకున్న రాజకీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రత్యర్థి, ఎస్పీ సీనియర్ నేత అజమ్ ఖాన్ వల్ల తాను ఏవిధంగా బాధపడింది అనే విషయాన్ని గురించి ఆమె చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో తాను రాణించడానికి చాలామంది నాయకులు సహాయ సహకారాలు అందించారని… వారందరిలో నేను గాడ్ ఫాదర్ లా భావించేది అమర్ సింగ్ నని ఆమె చెప్పుకొచ్చారు.అజమ్ ఖాన్తో తాను జరిపిన పోరాటంలో, ఒక దశలో తనపై యాసిడ్ దాడికి కూడా ఆయన ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అల్లరి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు తెలిపారు.ఆ సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీగా ఉన్న తనకు, అధినేత ములాయం సింగ్ సహా ఏ ఒక్క నాయకుడు కూడా తనపట్ల కనీసం సానుభూతి చూపించలేదని, అప్పుడు అమర్ సింగ్ డయాలసిస్ చేయించుకుంటూ దూరంగా ఉన్నారని ఆమె చెప్పారు.