తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “జయం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ నటి “సదా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి సదా వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో ఏకంగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది.
అంతేగాక తెలుగు తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో వరుసగా సినిమా అవకాశాలను కూడా దక్కించుకొని బిజీబిజీగా గడిపింది.
కాగా ఒకానొక సమయంలో చేతి నిండా సినిమా ఆఫర్లు మరియు పలు రకాల షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా గడిపిన సదా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అయితే సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయని సదా తీరికలేకుండా అన్ని చిత్రాలలోనూ నటించింది.అయితే ఇందులో కొన్ని మొహమాటానికి పోయి నటించగా మరికొన్ని పారితోషకం కోసం నటించింది.
దీంతో దాదాపుగా చాలా చిత్రాలు బాక్సాఫిస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.అంతేగాక తన స్టార్డం గురించి ఏమాత్రం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అమ్మడి సినిమా కెరియర్ పూర్తిగా డౌన్ అయ్యింది.
చివరికి ఈ విషయమే ఆమె సినీ కెరీర్ ని పూర్తిగా దెబ్బతీసింది.అంతేకాకుండా ఒకప్పుడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తదితర స్టార్ హీరోల సరసన నటించిన సదా ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఇంటి పట్టునే కాలం గడుపుతోంది.
ఆ మధ్య తమిళంలో ప్రముఖ దర్శకుడు మజిత్ దర్శకత్వం వహించిన “టార్చ్ లైట్” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో కనిపించింది.అయితే ఈ చిత్రంలో సదా తన భర్తని బ్రతికించుకునేందుకు డబ్బు అవసరం కాగా వ్యభిచారం నిర్వహించే మహిళ పాత్రలో కనిపించింది.ఈ చిత్రం తమిళంలో మంచి హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఎలాంటి సినిమా అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది.
దీంతో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని “శ్రీమతి 21ఎఫ్” పేరుతో అనువాదం చేశారు.
కానీ ఈ చిత్రం తెలుగులో విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు.దీనికితోడు అప్పటివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించిన సదా ఒక్కసారిగా వేశ్య పాత్రలో కనిపించడంతో తెలుగు సినీ ప్రేక్కులు యాక్సెప్ట్ చేయలేకపోయారు.
ఫలితంగా ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేవు.