ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి చెందిన వార్తలు నిన్న ఉదయం నుండే అన్ని న్యూస్ ఛానెల్స్ లో వచ్చాయి.అయితే ఆయన బాత్ రూంలో పడి ఉన్న ఫొటోలు మరియు వీడియోలు ఎక్కువగా మీడియాలో కనిపించాయి.
ఎన్నో ఏళ్లుగా నవ్వించి మెప్పించిన జేపీని జనాలు అలా చూడలేక పోయారు.ఆయన గొప్ప నటుడు.
ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటీ అంటూ చాలా మంది మానసిక ఆవేదనకు గురి అయ్యారు.బాత్ రూంలో మృత దేహం ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వస్తేనే ఇబ్బందిగా ఉంటుంది.
అలాంటిది ప్రముఖ న్యూస్ ఛానెల్స్ అన్ని కూడా ఆ ఫొటోలను చూపించడంతో అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు.
ఇప్పటికే తెలుగు మీడియాపై చెడు అభిప్రాయం ఉంది.
ఇలాంటి సమయంలో జేపీ బాత్ రూం వీడియోను ఫొటోలను చూపిస్తూ వార్తలు చెప్పడంతో వారి దిగజారుడుతనంను వారే నిరూపించుకున్నట్లయ్యింది.ఎన్నో సందర్బాల్లో మీడియాలో అసభ్య ఫొటోలు వీడియోలు వస్తుంటాయి.
కాని ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇలాంటి ఫొటోలు వీడియోలను పబ్లిష్ చేయడం ఏమాత్రం సబబు కాదంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ న్యూస్ ఛానెల్స్ దాదాపు అన్ని కూడా జేపీ బాత్ రూంలో మృతి చెంది ఉన్న ఫొటోలను పెట్టి న్యూస్ తయారు చేశాయి.
ఇలాంటి జర్నలిజం ఏంటో అంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
నవ్వుతూ నవ్విస్తూ ఉండే జేపీ గురించి చివరికి ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు.
ఆయన మృతికి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు బయటకు వచ్చినా కూడా మీడియా వారు సంయమనం పాటిస్తూ ఉండి కాస్త జాగ్రత్తగా న్యూస్ కవరేజీ ఇస్తే బాగుండేది.కాని మీడియా మాత్రం ఆయన ఫొటోలు దొరకడగమే ఆలస్యం ఎక్సక్ల్యూజివ్ అంటూ వేసుకున్నాయి.
ఇది నిజంగా సిగ్గు చేటు.ఇప్పటికి అయినా ఆ ఫొటోలను తీసేయాలి ఆ వీడియోలను తొలగించాలంటూ నెటిజన్స్ మరియు జేపీ అభిమానులు కోరుకుంటున్నారు.