టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి జయప్రద.తెలుగు తెర నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది.
తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ, హిందీ, భోజ్ పూరీ సినిమాలలో నటించిన ఈ భామ తరువాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమాలో స్టార్ హీరోయిన్ అయినా రాజకీయాలలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం రాజకీయాలలోనే ఉన్నా పార్టీలకి దూరంగా ఉంది.మళ్ళీ ఈ మధ్య కాలంలో జయప్రద అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో సందడి చేస్తుంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తుంది.అయితే ఇన్నేళ్ల తర్వాత ఆమె పంజాబీలో మొదటి సినిమా చేస్తుంది.
జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది.బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు.
అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగా బొకాడియాకి గుర్తింపు ఉంది.తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం మేరీ వోతీ దా వ్యాహ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
రాజ్ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా భూత్ అంకుల్–తుసీ గ్రేట్ హో ని ప్రారంభించారు.ఈ సినిమాతో పంజాబీలోకి ఎంట్రీ ఇస్తున్న జయప్రద తన కెరియర్ లో మరో భాషని చేర్చుకుంటూ అత్యధిక భాషా చిత్రాలలో నటించిన నటిగా అరుదైన గుర్తింపుని సొంతం చేసుకోబోతుంది.