అడ్వాన్స్ తిరిగిచ్చిన జాతిరత్నం.. ఎందుకంటే..!

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలెంట్ చూపించిన నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనుదీప్ డైరక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించారు.

 Jatiratnam Naveen Polishetty Return Advance To Producer Sithara Entertainme, Nts-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి ఒక సినిమా ఫిక్స్ చేసుకోగా ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లఏదు.ఇదేకాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా నవీన్ ఒక సినిమా కమిట్మెంట్ ఇచ్చాడట.

సితార నుండి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.

రంగ్ దే డైరక్టర్ వెంకీ అట్లూరితో నవీన్ హీరోగా ఒక సినిమా అనుకున్నారు.

అయితే నవీన్ కు వెంకీ చెప్పిన కథ కుదరడం లేదట.కథ ఓకే అనుకున్నా కథనం ఇంప్రెసివ్ గా లేదని చెప్పాడట అందుకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

అంతేకాదు కథ కుదిరిన తర్వాతే సినిమా చేద్దామని చెప్పి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడని టాక్.సితార లాంటి బ్యానర్ లో సినిమా చేస్తే నవీన్ కెరియర్ కు ప్లస్ అవుతుంది.

మరి తొందరపడకుండా ఆ బ్యానర్ తో టచ్ లో ఉంటేనే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube