సినిమాను ఒక ఫ్యామిలీ థియేటర్ లో చూడాలంటే వందల రూపాయల రోజులు పోయి వేల రూపాయల రోజులు వచ్చాయి.నలుగురు ఉన్న ఫ్యామిలీ ఒక సినిమాకు వెళ్లాలంటే తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు అయినా అవుతుంది.
అంత ఖర్చు ఈ కరోనా విపత్తు సమయంలో పెట్టి సినిమా కు వెళ్లడం అంటే కాస్త కష్టమే.అందుకే ఈమద్య కాలంలో మిడిల్ క్లాస్ వారు ఓటీటీ పై ఆధారపడుతున్నారు.
ఓటీటీలో కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవల విడుదల అయ్యి సక్సెస్ అయిన ఉప్పెన మరియు జాతి రత్నాలు సినిమా ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అంటూ ఆ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో జాతి రత్నాల టీమ్ నుండి కీలక ప్రకటన వచ్చింది.
ఎవరైతే ఓటీటీలో ఈ సినిమా చూడాలనుకుంటున్నారో వారికి బ్యాడ్ న్యూస్.
మేము సినిమా ను ఓటీటీలో విడుదల చేయడం లేదు.ఎన్ని రోజులు అయినా థియేటర్లలోనే మీరు చూడాల్సిందే అంటూ సరదాగా ఒక పోస్ట్ ను షేర్ చేశారు.
అంటే ఆ పోస్ట్ ను బట్టి మరో నెలన్నర రోజుల వరకు జాతి రత్నాలు సినిమా ఓటీటీ ద్వారా రావడం లేదు.జాతి రత్నాలు విడుదల అయిన రోజే విడుదల అయిన గాలి సంపత్ సినిమా ఇప్పటికే ఆహా లో వచ్చేసింది.
మరి కొన్ని సినిమాలు కూడా ఓటీటీ లో విడుదల కాబోతున్నాయి.కాని జాతి రత్నాలు మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు.
మొత్తానికి ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 50 కోట్ల వరకు వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తోంది.
లాంగ్ రన్ లో మరో పది నుండి పది హేను కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.