ఈమద్య కాలంలో ఉప్పెన తర్వాత అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జాతి రత్నాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఫుల్ లెంగ్త్ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మరియు దర్శకుడు అనుదీప్ లు మస్త్ బిజీ అయ్యారు.
ఇక కమెడియన్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు కూడా ప్రస్తుతం మోస్ట్ బిజీ కమెడియన్స్ గా మారిపోయారు.ఇంత మంది జాతి రత్నాల వల్ల బిజీ అయినా కూడా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాత్రం ఆఫర్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
అందుకు కారణం ఈమె ఇండస్ట్రీలోనే అతి పెద్ద అంటే ఎత్తైన హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.
టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోల కంటే ఈమె హైట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఈమె ప్రభాస్.వరుణ్ తేజ్ రేంజ్ హైట్ ఉన్న వారికి జోడీగా అయితేనే బాగుంటుంది.
అందుకే ఈమెను ఎంపిక చేసేందుకు చాలా మంది మేకర్స్ ఆసక్తి చూపడం లేదు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెను ఒక యంగ్ హీరో కోసం నిర్మాత సంప్రదించాడు.
కాని స్క్రీన్ టెస్ట్ తర్వాత రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.మొత్తానికి జాతి రత్నాలు అంతా బిజీ అయినా కూడా ఫిరియా మాత్రం తన హైట్ వల్ల ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతుందని అంటున్నారు.
ఇప్పుడు కాకున్నా తర్వాత తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఫరియాకు మంచి ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫరియా కు తగ్గ హీరోలు టాలీవుడ్ లో ఎవరై ఉంటారు చూడాలి.