సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా లో ఇప్పటికే హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైన విషయం తెలిసిందే.ఆమె మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా ఈ సినిమా లో ఉండబోతుంది అంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ విషయం.కనుక ఈ సినిమా లో కూడా పూజ హెగ్డే మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుంది అంటూ అంతా నమ్మకం తో ఉన్నారు.
ఆ మరో హీరోయిన్ ఎవరో కాదు, జాతి రత్నాలు హీరోయిన్ ఫరియ అబ్దుల్లా అంటూ ప్రచారం మొదలైంది.
జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నిస్తోంది.
ఈ సమయం లో మహేష్ బాబు కు జోడి గా సెకండ్ హీరోయిన్ పాత్ర లో నటించే అవకాశం దక్కిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.అయితే ఈ వార్తలు నిజం కాదు అంటూ ఫరియా అబ్దుల్లా సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమా కు సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఫరియా అబ్దుల్లా ని సంప్రదించలేదని, ప్రస్తుత ఆమె చేస్తున్న సినిమా ల జాబితా లో మహేష్ బాబు సినిమా లేదంటూ వారు క్లారిటీ ఇచ్చారు.
చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ విషయమై అనధికారికంగా స్పందిస్తూ.సెకండ్ హీరోయిన్ విషయమై ఇప్పటి వరకు చర్చ జరగలేదని, ఫరియా అబ్దుల్లా నీ ఎంపిక చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి సెకండ్ హీరోయిన్ లేకుండా సినిమా ను తీస్తాడా.
లేదంటే అతి త్వరలోనే సెకండ్ హీరోయిన్ ని ప్రకటిస్తాడా అనేది చూడాలి.మొత్తానికి మహేష్ బాబు 28వ సినిమాలో ఫరియా లేదు అనే విషయం లో క్లారిటీ వచ్చేసింది.