గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా కూడా జాతి రత్నాలు సందడి కనిపిస్తుంది.ముఖ్యంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాను జాతి రత్నాలు వాడుకున్నట్లుగా మరే సినిమా టీమ్ వాడుకోలేదు అనడంలో సందేహం లేదు.
సినిమా ప్రమోషన్ మొత్తం వీరు సోషల్ మీడియా లో చేసినట్లుగా అనిపిస్తుంది.ఏ ప్లాట్ ఫామ్ చూసినా కూడా వీరు కనిపిస్తున్నారు.
జాతి రత్నాలు సినిమా విడుదల తర్వాత కూడా హంగామా కనిపిస్తుంది.వీకెండ్ లో ఓవర్సీస్ లో వసూళ్లను రాబట్టడం కోసం హీరో నవీన్ పొలిశెట్టి మరియు కమెడియన్ ప్రియదర్శి లు అమెరికా వెళ్లారు.
వారిద్దరు అమెరికా వెళ్లడంపై తనను తీసుకు వెళ్లక పోవడంపై మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ సీరియస్ అయ్యాడు.వారిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అరేయ్ దర్శ మరియు నవీన్ మీరు నన్ను వదిలేసి పాస్ పోర్ట్ లు తీసుకుని అమెరికా వెళ్లారు కదా.నా వద్ద పాన్ కార్డ్ ఉందని చెప్పినా కూడా ఎందుకు నన్ను తీసుకు పోలేదు.మీరు ఇద్దరే అమెరికా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారా.ఇక్కడకు రార్ర మీ సంగతి చెప్తాను అంటూ ఫన్నీ వార్నింగ్ ఇచ్చాడు.రాహుల్ కు పాస్ పోర్ట్లేకపోవడం వల్ల అక్కడకు వెళ్లలేదని తెలుస్తోంది.మొత్తానికి రాహుల్ మరోసారి జాతిరత్నాలు సినిమా సోషల్ మీడియాలో సందడి చేసేలా చేశాడు.
ఇక రాహుల్ అక్కడకు వెళ్లకున్నా కూడా నవీన్ మరియు దర్శిలు అక్కడ తెగ సందడి చేస్తున్నారు.సినిమా పై వారు అంచనాలు పెంచే విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు.
ఈ సినిమాతో హీరోయిన్ గా ఫరియా పరిచం అవ్వగా అనుదీప్ దర్శకత్వం వహించాడు.మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.
దాదాపుగా 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో 50 కోట్లకు చేరుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.