నవీన్ పోలిశెట్టి.ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగిపోతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ హీరో దొరికాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు వరస ఆఫర్లను అందుకుంటున్నాడు.
నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు.
ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం దూసుకు పోతుంది.విడుదల అయ్యి పది రోజులు అవుతున్న ఇంకా కలెక్షన్ల పరం గా కుమ్మేస్తుంది.
కొత్త సినిమాలు వచ్చినా వాటిని కూడా సైడ్ చేసి ఈ సినిమా దూకుడు చూపిస్తుంది.ఈ సినిమాను అనుదీప్ తెరకెక్కించారు.
స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు.
డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ కలెక్షన్లను ఇంకా పెంచే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన జాతి రత్నాలు ఇప్పటికే 30 కోట్లకు పైగా లాభాలు రాబట్టారు.ఈ సినిమా ఇక్కడే కాదు యు ఎస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతుంది.
అక్కడ కూడా మంచి ప్రమోషన్స్ చేస్తూ సినిమాను లాభాల పంట పండిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి యు ఎస్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ రోజు వచ్చే కలెక్షన్లతో వన్ మిలియన్ మార్క్ ను రీచ్ చేయబోతున్నారు.ఇప్పటికే భారీ లాభాలలో ఉన్నారు మేకర్స్.
ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి పెద్ద పెద్ద బ్యానర్లలో ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నవీన్ పోలిశెట్టి ఇప్పటికి ఒక రేంజ్ హిట్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.