నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా హీరోయిన్ గా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా మూడు వారాలు ముగిసి నాలుగవ వారంలోకి అడుగు పెట్టబోతుంది.
మూడు వారాల పాటు ఈ సినిమాకు పోటీ అనేది లేకుండా సాగింది.ఉప్పెన జోరు ముగిసిన సమయంలో వచ్చిన జాతి రత్నాలకు మరే సినిమా పోటీ అన్నట్లుగా నిలువలేదు.
శ్రీకారం సినిమా కాస్త ధీటుగా ఉంటుందేమో అనుకున్నా ఆ సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.ఇక ఈ సినిమా విడుదల అయిన వారంలో వచ్చిన ఇతర సినిమా లు పెద్దగా ఆడలేదు.
తదుపరి వారాల్లో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా జనాల్లో కనీసం నోటెడ్ కూడా కాలేదు.దాంతో మూడు వారాల పాటు ఏక బికీనా ముఖ్యంగా వీకెండ్స్ లో సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది.
జాతి రత్నాలు నాల్గవ వారంలో ఎలాంటి వసూళ్లు రాబడుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు అన్ని వర్గాల వారిని మూడు వారాల పాటు రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.
కాని నాల్గవ వారంలో మాత్రం ఈ సినిమాకు కాస్త పోటీ తప్పడం లేడు.నేడు ఈ సినిమా కు పోటీ అన్నట్లుగా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా వచ్చింది.
దాంతో పాటు కార్తీ నటించిన సుల్తాన్ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ రెండు సినిమాలకు కూడా పాజిటి్ టాక్ వచ్చింది.దాంతో ఆ సినిమాలు జాతి రత్నాలు సినిమాల వసూళ్లపై ప్రభావం చూపించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ వారం నుండి జాతి రత్నాలు సినిమాను చూడకున్నా ఇప్పటికే వచ్చిన వసూళ్లతో ఆ సినిమా పెట్టుబడికి పది రెట్ల లాభం వచ్చిందని అంటున్నారు.