జాతిరత్నాలు సినిమా తాజాగా రిలీజ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు రావడంతో పాటు, వారి నటనకి ప్రశంసలు కూడా లభించాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా పరిచయం అయ్యింది.ఈ అమ్మడు పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
మొదటి సినిమానే కామెడీ టైమింగ్ తో కుమ్మేసింది.ఈ సినిమాలో ఫరియా గ్లామర్ కి అందరూ కనెక్ట్ అయిపోయారు.
నేచురల్ బ్యూటీ అనే గుర్తింపుని ఇచ్చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ రవితేజ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తున్న అధికారికంగా మాత్రం ఎనౌన్స్ చేయలేదు.
ఇక జాతిరత్నాలు హ్యాంగోవర్ ఇప్పటికే ఉంది.ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ఓ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఫరియా డ్రీమ్ రోల్ ఏంటీ అంటూ ప్రశ్నించగా సైకోగా నటించాలని కోరిక అని ఈ భామ చెప్పుకొచ్చింది.అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది.
మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే ప్రతి అమ్మాయికి పలానా పాత్ర చేయాలని ఉంది అంటూ ముందే చెబుతారు.
అలాగే ఫరియాకి కూడా తనలో నెగిటివ్ షేడ్స్ ని బయటపెట్టడానికి సైకో పాత్ర అయితే బాగుంటుందనే భావనతో చెప్పి ఉంటుందని టాక్ వినిపిస్తుంది.తాను సినిమాల సంఖ్య స్పీడ్ గా పెంచుకోవాలని భావించడం లేదు.
మంచి సినిమాలు మాత్రమే చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆమె చెప్పింది.మొత్తానికి వచ్చిన అవకాశాలు అన్ని ఒప్పుకోకుండా సెలక్టివ్ గా మనసుకి నచ్చే పాత్రలు మాత్రమే చేయడానికి ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రయత్నం చేస్తుందని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.