జాతి రత్నాలు సినిమా ఒక రోజు ముందే చూసేసిన నెల్లూరు వాసి

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నవీన్ పొలిశెట్టి నటించిన జాతి రత్నం సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా ను నేడు రాత్రికి కాని సెలబ్రెటీలకు ప్రత్యేక షో వేసే అవకాశం లేదు.

 Jathi Ratnalu First Premiere For Nelluru Person,naveen Polisetty,twiter,social M-TeluguStop.com

కాని నెల్లూరుకు చెందిన మహిదర్ రెడ్డి మాత్రం అప్పుడే జాతిరత్నం సినిమాను చూసేశాడు.అతడు ఏమీ పైరసి చేసి సినిమా ను చూడలేదు… లేదా అతడు ఏమీ కూడా పెద్ద సెలబ్రెటీ కాబట్టి సినిమా చూపించలేదు.

ఒక సాదారణ వ్యక్తి అయినా కూడా స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు తమ మనిషిని అక్కడకు పంపించి సినిమా ను చూపించారు.అతడికి ఎందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా చూపించారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది.

మహిదర్ రెడ్డి ట్విట్టర్‌ లో చేసిన ఒక ట్వీట్‌ సినిమా చూసేలా చేసింది.

ఇంతకు ఆయన ఏం చేశాడంటే.

ట్విట్టర్ లో నవీన్ పొలిశెట్టిని ట్యాగ్‌ చేసి ఇప్పటి వరకు నేను బ్లాక్ లో టికెట్‌ కొనుగోలు చేయలేదు.కాని జాతి రత్నాలు సినిమా టికెట్‌ ను పది రెట్లు పెట్టి అయినా చూడాలనుకున్నాను.

కాని ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో జాతి రత్నాలు సినిమాను చూడలేక పోతున్నాను.ఎందుకంటే కాలు ప్యాశ్చర్ అవ్వడంతో నేను పూర్తిగా నెల రోజుల వరకు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి ఉంది.

ఆ కారణంగా నేను మీ జాతి రత్నాలు సినిమాను చూడలేక పోతున్నాను.ఇప్పుడు ఏం చేయాలంటూ నవీన్ ను మహిదర్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించాడు.

చిత్ర యూనిట్‌ సభ్యులతో మాట్లాడి మహిదర్ రెడ్డి సినిమాను ముందే చూసే విధంగా ఏర్పాటు చేశాడు.సెన్సార్‌ కాపీని మహిదర్‌ రెడ్డికి చూపించేందుకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు పంపించారు.

సినిమా చాలా బాగుందని ఒక టీమ్ గా సినిమాకు వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మహిదర్ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube