సినిమాల్లో చాలా వరకు ఎక్కువ సీన్ లను చేసినప్పుడు సినిమా టైమింగ్ కోసం లేదా సినిమాకు కరెక్ట్ గా సెట్ అవకపోవడం వల్ల డిలీట్ చేస్తూ ఉంటారు.ఇలా ఎన్నో సినిమాలలో డిలీటెడ్ సీన్స్ ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సినిమా జాతి రత్నాలు లో కూడా కొన్ని డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి.
అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతి రత్నాలు.ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు ప్రధాన పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క సన్నివేశం మంచి కామెడీతో ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది.పలు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను నిడివి కారణంగా దర్శక నిర్మాతలు డిలీట్ చేశారు.ఇక తాజాగా డిలీట్ చేసిన సన్నివేశాలను ఓ టైటిల్ తో ఈ సిని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.‘ఈ సీన్ లు ఎందుకు డిలీట్ చేశారయ్యా‘ అంటూ ఈ సిని నిర్మాణ సంస్థ స్వప్న మూవీస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కొన్ని సన్నివేశాలు పంచుకోగా డిలీటెడ్ సీన్స్ మొత్తం ఆరు నిమిషాల పాటు ఉంది.అందులో ప్రతి ఒక్క సన్నివేశం మంచి కామెడీతో ఉండగా నిజంగా ఇందులో ఇంత మంచి సీన్లు ఎందుకు డిలీట్ చేశారోనని అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సన్నివేశాలు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.