చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ హిట్స్ అయిన చిత్రాలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి మౌత్ టాక్ తో అందరికి రీచ్ అయ్యి భారీ కలెక్షన్స్ ని రాబడతాయి.
ఇలా వచ్చిన సినిమాలలో నటించిన నటీనటులు కూడా తరువాత మంచి స్టార్స్ గా ఎదిగారు.ఇప్పుడు అదే విధంగా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్బుతమైన హిట్ అందుకున్న సినిమా జాతిరత్నాలు.
స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు.నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో నవ్వులు పూయించింది.
ప్రేక్షకుడు సీట్లో కూర్చున్నప్పటి నుంచి బయటకి వచ్చే వరకు నవ్వుతూనే ఉంటారు.ఈ నవ్వులే సినిమా సక్సెస్ కి కారణం అయ్యాయి.
ఈ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి స్టార్ అయిపోయాడు.అలాగే దర్శకుడు అనుదీప్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
జాతిరత్నాలు ఎఫెక్ట్ తో బాగుందనే టాక్ వచ్చిన శ్రీకారం సినిమా కూడా డిజాస్టర్ అయిపొయింది.ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధమవుతుంది.
సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులు అయ్యింది.ఈ 25 రోజులలో ఏకంగా 38.76 కోట్ల షేర్ రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే 68 కోట్ల వరకు ఉంది.
ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా జాతిరత్నాలు సినిమా నిలిచింది.ఇక లాక్ డౌన్ తర్వాత భారీ హిట్ అందుకున్న సినిమాగా కూడా నిలబడింది.
అలాగే బలమైన కంటెంట్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటే తెలుగు ప్రేక్షకుల నుంచి కచ్చితంగా ఆదరణ దొరుకుతుందని జాతిరత్నాలు సినిమాతో మరోసారి రుజువైంది.
.