మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ … ఇద్దరు ఇద్దరే … నెం.1 పోటిలో నువ్వా నేనా అని తలబడుతున్నవారే.ఫ్లాపులు వచ్చినా, గ్యాపులు వచ్చినా ఇద్దరి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.మహేష్ ని కొట్టాలంటే పవన్ కావాల్సిందే, పవన్ కి సరైన పోటి ఎవరైనా ఉన్నారా అంటే అది మహేషే.
మరి ఇంత క్రేజ్ ఉంది కాబట్టే వాళ్ళిద్దరిని వాడుకుంటూ ఉంటారు తెలుగు సినిమాల్లో.మరి వీరద్దరి మధ్య పోటిని వాడుకుంటే? ఇదే చేసారు “జత కలిసే” చిత్రంలో.విడుదల చేసిన ట్రైలర్ లో సప్తగిరి “శ్రీమంతుడు” గా కనిపిస్తే , శకలక శంకర్ “సర్దార్” గెటప్ లో సప్తగిరితో పోటిపడుతున్నాడు.ఇదంతా నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కాని సీన్లో ఎదైనా తేడా జరిగితే మన సూపర్ స్టార్, పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహాన్ని తట్టుకోవడం చాలా కష్టం.
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తెజస్వి మడివాడ కథానాయిక.ఓంకార్ తో పాటు, యుక్త క్రియేషన్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
రాకేష్ శశి దర్శకుడు.ఈ నెల 25న జత కలిసే ప్రేక్షకుల ముందుకు రానుంది.