జపాన్ కి చెందిన ఒక కుబేరుడు అందమైన టీనేజ్ యువతులకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు.తనతో చంద్రమండలం యాత్ర చేయడానికి 20 ఏళ్ల అందమైన అమ్మాయి కావాలనని అంటున్నాడు.
ఇక తనకి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చాడు.ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తన ఒంటరితనం తీర్చే అమ్మాయి కావాలని ఆమెతో చంద్రమండలంకి షికారుకి వెళ్లి వస్తానని ఈ కుబేరుడు అంటున్నాడు.వివరాలలోకి వెళ్తే ఆన్లైన్ ఫ్యాషన్ వ్యాపార దిగ్గజం యుసాకు మేజావా 44 ఏళ్ల వయసులో ఒంటరిగా బతుకుతున్నానని ఏదో వెలితిగా ఉందని అంటున్నాడు ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు సంతానం ఉన్నా ఎందుకో ఒంటరినన్న భావన కలుగుతోంది.
అందుకే తనకి టీనేజ్ గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్నా అని తెలిపాడు.
ఇక ఈ దరఖాస్తుకి సంబందించిన కొన్ని నిబంధనలు కూడా ఈ కుబేరుడు పెట్టాడు.
దరఖాస్తు చేసుకున్న వారితో డేటింగ్లకు వెళ్తూ మార్చి నాటికి తుది ఎంపిక పూర్తి చేస్తానని తెలిపాడు.సోషల్ మీడియాలో తరుచుగా వార్తలలో ఉండే ఈ కుబేరుడు ఓ పెయింటింగ్ని 11.05 కోట్ల డాలర్లు పెట్టి కొని వార్తల్లో నిలిచాడు.కొద్ది రోజుల క్రితం సోషల్ ఎక్స్పరిమెంట్ పేరుతో ఇటీవల ఆయన తన వెయ్యి మంది ట్విట్టర్ ఫాలోవర్స్కి రూ.65 కోట్లు పంచి పెట్టి సంచలనం సృష్టించారు.తాజాగా తనతో చంద్రమండలంకి వచ్చే టీనేజ్ గర్ల్ కోసం ప్రకటన ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.
మరి అతని ఆఫర్ కి ఎంత మంది టీనేజ్ గర్ల్స్ నుంచి దరఖాస్తులు వెళ్తాయి అనేది చూడాలి.