జపాన్ ఫ్యాషన్ దిగ్గజం యుసాకు మేజావా తన ట్విట్టర్ ఫాలోవర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న 1000 మందికి 9 మిలియన్లు ఇస్తానని ప్రకటించారు.
ఇందుకోసం వారు చేయాల్సిందల్లా అతనికి రీట్వీట్ చేయడమే.ఇది వారి ఆనందాన్ని మరింత పెంచుతుందో లేదో చూడటానికి తాను చేస్తున్న ప్రయోగంగా మేజావా తెలిపారు.
యూట్యుబ్లో చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.ఒక వ్యక్తి జీవితంలో ఆకస్మాత్తుగా మిలియన్ యెన్ రావడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడటానికి ఈ సీరియస్ సోషల్ ట్రయల్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వీడియోలో మేజావా పోటీ వివరాలను వెల్లడించారు.దీనిని పోటీదారులు తమకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా తెలిపారు.ఇందుకోసం వారు చేయాల్సిందిల్లా ట్విట్టర్లో తనను ఫాలో అవుతూ, జనవరి 7 అర్థరాత్రి ఈ పోటికి వివరాలకు సంబంధించిన ట్వీట్ను రీట్వీట్ చేయాలి.ఇప్పటికే 4 మిలియన్ల మంది మేవాజా పిలుపుకు స్పందించి రీట్వీట్ చేశారు.
లాటీరీ ద్వారా విజేతలను ఎంపిక చేసిన అనంతరం రెండు మూడు రోజుల్లో మేవాజా స్వయంగా వారికి తెలియజేస్తారు.విజయం సాధించిన వారు పొందిన ఆనందాన్ని తాను స్వయంగా తెలుసుకుంటానని, అలాగే ఈ ప్రయోగాన్ని విశ్లేషించేందుకు సామాజిక శాస్త్రవేత్లను పిలుస్తానన్నారు.
మేవాజాకు ఇలాంటివి కొత్త కాదు.2019 జనవరిలోనూ ఆయన ఇదే రకమైన ప్రయోగం చేశారు.100 మిలియన్ యెన్లు, (సుమారు 9,14,000 ) 100 మంది ట్విట్టర్ ఫాలోవర్లకు పంచుతానని తెలిపాడు.ఈ క్రమంలో మేవాజా ఒక రికార్డును బద్ధలు కొట్టాడు.గతేడాది జనవరిలో ఆయన చేసిన ట్వీట్ను 4.68 మిలియన్ల మంది రీ ట్వీట్ చేశారు.కాగా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.మేజా ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర్లు ఆయనకు రాక్ మ్యూజిక్, పెయింటింగ్ అంటే ఇష్టం.ఇదే సమయంలో 2017లో జీన్ మిచెల్ బాస్క్యియేట్ వేసిన పెయింటింగ్పై 1,111 మిలియన్ డాలర్లు వెచ్చించాడు.