జపాన్ దేశంలో ఇండియన్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది.మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా సినిమాలకి అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఒకప్పుడు రజినీకాంత్ కి జపాన్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు.రజినీకాంత్ ప్రతి సినిమా జపాన్ బాషలో రిలీజ్ అవుతూ ఉండేది.
అయితే రాజమౌళి బాహుబలి సినిమా కూడా జపాన్ బాషలో రిలీజ్ చేయబడి అక్కడ సూపర్ హిట్ అయ్యింది.ఇక బాహుబలి సినిమా క్రేజ్ ఎంతలా జపాన్ లో ఉందంటే ఇందులో పాత్రల పేర్లుతో కార్టూన్ బొమ్మలని కూడా అక్కడి వ్యాపారులు మార్కెట్ లోకి రిలీజ్ చేశారు.
బాహుబలి సినిమాతో ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ జపాన్ లో ఏర్పడింది.అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు.
తారక్ డాన్స్ లు అంటే జపాన్ పడిచస్తారు.ఇదిలా ఉంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య గ్యాప్ చాలా తగ్గిపోయింది.
విశ్వం మొత్తం అంతర్జాలంలో దర్శనం ఇస్తుంది.
అలాగే సోషల్ మీడియా ద్వారా చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు.
సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాని ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు.అలాగే యుట్యూబ్ లో డిఫరెంట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.
ఈ కోవలోనే ఇప్పుడు జపాన్ జంట ఎన్టీఆర్ సినిమాలోని పాటలు డాన్స్ లు చేస్తూ తెలుగు ప్రజలని విశేషంగా ఆకర్షిస్తున్నారు.వారి పాటల కోసం ఏకంగా ఆ జంట యుట్యూబ్ చానల్ లో ఫాలో అవుతున్నారు.
తెలుగు ప్రజల క్రేజ్ కారణంగా ఆ జపాన్ జంటకి కూడా విపరీతమైన క్రేజ్ సోషల్ మీడియాలో వస్తుంది.గతంలో అశోక్, సాంబ సినిమాలోని పాటలని డాన్స్ లు చేసిన ఆ జంట ఇప్పుడు మరో ఎన్టీఆర్ పాటకి స్టెప్పులు వేసి వీడియో రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కంత్రీ సినిమాలోని వయస్సునామి పాటకు ఓ జపనీస్ జంట డ్యాన్స్ చేసింది.
మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటున్నట్టుగా ఈ డ్యాన్స్ ని చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.