యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మొదలుపెట్టాడు.గతంలో వీరి కాంబోలో వచ్చిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది.మరో హీరోయిన్గా అలనాటి లెజెండరీ హీరోయిన్ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ బ్యూటీ గతంలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ సినిమాలో తొలుత ఈమెను తీసుకోవాలని చూశారట.
అయితే ఆమె కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించడం లేదు.
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తుండటంతో శ్రీదేవి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది.