తెలంగాణాలో ఎన్నికల ఫలితాలపై ఏపీలో టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ తమ స్పందన తెలియజేశాయి.ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాకుండా స్పష్టంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ విజయం పై ఒక లేఖ విడుదల చేశారు.ఆ లేక యధాతంగా చూస్తే…
‘‘ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది.తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు.
ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది.ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు.విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అంటూ పవన్ ఒక లేఖ విడుదల చేశారు.
తాజా వార్తలు