శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూసుకొని మురిసిపోవాలని అనుకుంది.ఆమె బ్రతికి ఉన్నప్పుడే కూతురు మొదటి సినిమా ధడక్ స్టార్ట్ అయ్యింది.
అయితే అనూహ్యంగా ఆ సినిమా చూడకుండానే అతిలోక సుందరి మృతి చెందింది.ఆమె మరణం యావత్ సినీ ప్రపంచంతో కూతుళ్ళని కూడా తీవ్రంగా కలచి వేసింది.
అయిన కూడా తల్లి కోరిక తీర్చే పనిలో జాన్వీ కపూర్ ఉంది.మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.
ఇక రెండో సినిమానే ఒక బయోపిక్ చేయడానికి ఒకే చెప్పి పెద్ద సాహసమే చేసింది.ఇక జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ చేసే బాధ్యతని బోణీ కపూర్ నిర్మాత కరణ్ జోహార్ చేతిలో పెట్టాడు.
స్టార్ వారసులకి గ్రాండ్ ఎంట్రీ అందించి వాళ్ళని కరణ్ స్టార్స్ ని చేసాడు.అలియా భట్ కూడా అలాగే ఫ్రేమ్ లోకి వచ్చింది.
అలాగే జాన్వీ కపూర్ ని కూడా కరణ్ జోహార్ స్టార్ హీరోయిన్ గా మారుస్తాడు అనుకుంటే చివరికి ఒటీటీ హీరోయిన్ గా మార్చేస్తున్నాడు అంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది.సౌత్ లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాన్ని వదులుకొని బాలీవుడ్ లో గట్టిగా పాగా వేయాలనుకుంటే కరణ్ జోహార్ తీసుకుంటున్న నిర్ణయాల వలన జాన్వీకి మొదట్లోనే కెరియర్ కి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది.
ఆమె రెండో సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.ఇక మూడో సినిమాని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.వరుసగా రెండు సినిమాలు థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే తరువాత జాన్వీ కపూర్ ని ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ గా రిసీవ్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది అని భావిస్తున్నారు.మరి ఈ సారైనా సౌత్ మీద దృష్టి పెట్టి ఇక్కడైనా తల్లిలా స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు జాన్వీ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.