అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో బాగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.
నటనతో కూడా మంచి గుర్తింపు అందుకుంది.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఇదిలా ఉంటే తనకు బాధగా ఉందంటూ తన అభిమానులతో ఓ విషయాన్ని పంచుకుంది జాన్వీ.
జాన్వీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గుడ్ లక్ జెర్రీ’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో జాన్వీ జెర్రీ పాత్రలో నటించగా.
ఈ సినిమా తమిళంలో హీరోయిన్ నయనతార నటించిన ‘కోలమావు కోకిలా‘ హిందీ రీమేక్ గా తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
ఇక ఈ విషయం గురించి కొన్ని విషయాలు తెలిపిన జాన్వీ కపూర్.ఈ సినిమా షూటింగ్ పూర్తయిందంటే నమ్మలేకపోతున్నానంటూ తెలిపింది.
ఈ సినిమా ఇలా మొదలు పెట్టి అలా పూర్తిచేసినట్లు ఉందని, ఇక ఈ సినిమా ప్రయాణంలో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపింది.
అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో ఎవరైనా కాస్త అసహనంగా కనిపిస్తే వారిని తెగ నవ్వించేదట.చాలా సరదాగా ఈ సినిమా షూటింగ్ చేశామంటూ.ఇక టీమ్ అందరిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని పంచుకుంది జాన్వీ.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి.ఇక జాన్వీ మరో సినిమా ‘ దోస్తానా 2‘ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.