ప్రముఖ బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ తన అందంతో పాటు తన వ్యక్తిగత విషయంలో కూడా ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.
బాలీవుడ్ నటి అయిన జాన్వికపూర్ తెలుగుదనం ఉట్టిపడేలా చీరలో బాగా కనిపిస్తుంది.ఇక ఈ భామ.సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె అభిమాని కోసం బాధపడుతున్న విషయం వైరల్ గా మారింది.
సినీ నటి నటులు తాము ఎక్కడికైనా వెళ్లిన లేదా ఎక్కడినుండైనా వస్తున్నా.
వారు కనిపించేది ఎయిర్ పోర్ట్ లోనే.ఇక ఈ క్రమంలో హీరో హీరోలు కనిపిస్తున్న సమయంలో ఏ అభిమానులైన వారితో ఫోటో దిగాలని అనుకుంటారు.
అలా కొందరు ఫోటోలకు ఫోజులు ఇవ్వగా మరికొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు.ఇక తాజాగా జాన్వీ కపూర్ అలాకాకుండా ఇతరులను నొప్పించకుండా చేసిన పనికి అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన జాన్వికపూర్ తో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.కానీ నీ ఆమె సెక్యూరిటీ సిబ్బంది అతని అడ్డుకుంటూ అతడిని నెట్టివేశారు.ఇది చూసిన జాన్వీ కపూర్ అభిమానిని తన దగ్గరకు పిలిచి అతడితో సెల్ఫీ దిగింది.ఇక తనపై విరుచుకుపడ్డ సెక్యూరిటీ సిబ్బందిలపై జాన్వీ కపూర్ విరుచుకుపడింది.ఇక అతడు సంతోషంగా ఇంటికి వెళ్లాడని భావించికుంది.మొత్తానికి జాన్వీ కపూర్ తన మనస్తత్వం తో అందర్నీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం జాన్వీ హార్థిక్ మెహతా దర్శకత్వంలో వస్తున్న రూహి సినిమాల్లో నటిస్తుంది.అంతేకాకుండా గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.