అలనాటి తార అభిమానులంతా ఎంతో ఇష్టంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.ఆ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.
అని ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇంత వరకు ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వలేదు.ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టు టాక్.
నందమూరి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు ఆలియా భట్, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి.
ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ను కొరటాల శివ సంప్రదించారట.దీంతో ఈ బ్యూటీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.మరి త్వరలోనే ఈ విషయం అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు టాక్.
టాలీవుడ్ లో మంచి లాంచింగ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న జాన్వీ ఈ సినిమాతో కనుక ఎంట్రీ ఇస్తే ఇక తిరుగుండదు అని అంత అబుకుంటున్నారు.ప్రెసెంట్ ఈ సినిమా కోసం కొరటాల బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఇందు కోసం ముగ్గురు టాప్ రచయితలు కూడా రంగంలోకి దిగి కొన్ని సీన్స్ పై చర్చలు, మార్పులు వంటివి చేస్తున్నారట.
ఇక ఈ సినిమా ఇంకా మొదలు పెట్టకుండనే విడుదల తేదీ కూడా ప్రకటించారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఇక ఈ సినిమా వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లడమే కాకుండా ఫాస్ట్ పూర్తీ చేయబోతున్నారట.