అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమె వారసత్వంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్.ఈ అమ్మడు కెరియర్ ఆరంభం నుంచి రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో వెళ్ళకుండా తన ప్రత్యేకత కనిపించే విధంగా సినిమాలు ఎంపిక చేసుకుంటుంది.
కొత్తదనం ఉన్న కథలతో ఎక్కువగా ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఇష్టపడుతుంది.ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.
తరువాత గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించి పెద్ద సాహసమే చేసింది.ఆ సినిమా కూడా నటిగా ఆమెని మరో స్థాయిలో నిలబెట్టింది.
ప్రస్తుతం ఆమెచేతిలో ఏకంగా నాలుగు నుంచి ఐదు సినిమాల వరకు ఉన్నాయి.ఈ సినిమాలలో హీరోలతో రొమాన్స్ చేసే కథలు ఏవీ లేవనే చెప్పాలి.
అలాగే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.
ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ నర్స్ గా నటించింది.
ఇప్పుడు జాన్వీ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాతో బిజీగా ఉంది.ఈ సినిమా షూటింగ్ లో ఆటో నడుపుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఎలక్ట్రికల్ రిక్షా నడుపుతూ జాన్వీ సెట్స్ మీద హల్ చల్ చేసింది.ఆమె కాన్ఫిడెంట్ గానే నడుపుతున్నప్పటికీ వెనుక కూర్చున్న వాళ్లు భయంతో అంటూ కేకలు పెట్టటం వినిపించింది.
దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సినిమా షూటింగ్ సమయంలో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక అల్లరి పని చేయడం జాన్వీ కపూర్ కి మొదటి నుంచి భాగా అలవాటు.
దానిలో భాగంగానే ఇప్పుడు ఆటో ఈరిక్షా నడుపుతూ అందరిని భయపెట్టింది.